క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఏపీ ప్రభుత్వం ‘మొహర్రం’ సెలవును ఈ నెల 26కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవుల జాబితా ప్రకారం, ఈ నెల 25వ తేదీన మొహర్రం సెలవుగా ఉంది.అయితే, వక్ఫ్ బోర్డ్ సీఈవో మొహర్రం పండుగ 26న జరగనుందని ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వం సెలవు తేదీని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మార్పు కారణంగా, ఈ నెల 26వ తేదీన (మంగళవారం) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మరియు ఇతర ప్రైవేటు సంస్థలకు సెలవు ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం మరో జీవో కూడా జారీ చేసింది.
ఖరీదైన ప్రొటీన్ పౌడర్లకు గుడ్బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
ఫేవరెట్ హీరోపై మనసు విప్పిన రుక్మిణి వసంత్..!