Homeతెలంగాణమునుగోడు ఆశ..రాజన్న శ్వాస..

మునుగోడు ఆశ..రాజన్న శ్వాస..

  • మునుగోడు ఆశ..రాజన్న శ్వాస..

  • సేవలో సాటిలేని నాయకుడికి దక్కాలి మంత్రి పీఠం!

  • మంత్రి పదవిపై అధిష్టానం వంచన ఎందుకు?.

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): ​తెలంగాణ రాజకీయ చిత్రపటంలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ప్రత్యేక నాయకుడు. కేవలం అధికారం కోసం రాజకీయాలు చేసే నాయకుల మధ్య, తన సంపాదనను ప్రజల కోసం ఖర్చు చేస్తూ, ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ, భరోసా ఇచ్చే ఆయన శైలి అద్వితీయం. మునుగోడు ప్రజలు ఆయనను కేవలం ఒక ఎమ్మెల్యేగా చూడటం లేదు, ఒక పెద్ద దిక్కుగా, ఒక ఆపద్బాంధవుడిగా కొలుస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన సేవలు, ఏ రాజకీయ పదవికి తక్కువ కావు.

తన తల్లి స్మృత్యర్థం స్థాపించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్, ద్వారా ఆయన చేసిన పనులు అసంఖ్యాకం. మునుగోడులో వేలాది మంది కంటి సమస్యలతో బాధపడుతుంటే, ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, స్వయంగా దగ్గరుండి శస్త్రచికిత్సలు చేయించారు. వందలాది మందికి కంటి చూపును ప్రసాదించిన ‘రాజన్న’పై ప్రజల్లో అపారమైన గౌరవం ఉంది. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల, కోసం ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇది ఎంతో మంది గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ప్రాణవాయువులా మారింది.

​కరోనా కష్టకాలంలో కొండంత అండగా నిలిచారు ఆయన. ప్రపంచమంతా భయంతో వణికిపోతున్న వేళ, రాజగోపాల్ రెడ్డి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల్లోకి వెళ్లారు. సుమారు 10 నుండి 15 కోట్ల రూపాయల సొంత నిధులతో, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఎంతో మందికి ఇంజనీరింగ్, మెడిసిన్ ఫీజులు చెల్లించి వారి భవిష్యత్తుకు బాటలు వేశారు.

మంత్రి పదవితోనే మునుగోడు అభివృద్ధి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనివార్యమనే చెప్పుకోవాలి. ​మునుగోడు అంటేనే ఫ్లోరోసిస్ శాపం. దశాబ్దాలుగా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా నిధులు తెస్తున్నప్పటికీ, ఒక మంత్రిగా ఆయనకు ఉండే అధికారం, ప్రభావం మునుగోడు దశను మార్చగలవు. డిండి ప్రాజెక్టులు పూర్తి కావాలని, నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది ఆయన కల. అది మంత్రి పదవి ద్వారానే సులభతరం అవుతుంది.

నిబద్ధతకు దక్కని ఫలితం?

​కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, తెలంగాణలో పార్టీ పునర్వైభవం కోసం రాజగోపాల్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిది. పార్టీ కోసం తన పదవిని త్యాగం చేసి ఉపఎన్నికకు వెళ్లిన ధైర్యశాలి ఆయన. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం మాట ఇచ్చింది. కానీ నేడు క్యాబినెట్ లో చోటు కల్పించకుండా, మొండిచేయి చూపడంపై మునుగోడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నాయకుడు, సొంత ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నించే నైజం ఉన్న నాయకుడు కాబట్టే, ఆయనను పక్కన పెడుతున్నారా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ​

ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ, రాజగోపాల్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందుంటున్నారు. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అసెంబ్లీలో, గర్జించడానికి కూడా ఆయన వెనకాడటం లేదు. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అలాంటిది. దమ్మున్న లీడర్‌కు దక్కాల్సిన గౌరవం,​రాజగోపాల్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. పార్టీలతో సంబంధం లేకుండా, ఏ జెండా పట్టుకున్నా గెలిచి వచ్చే మాస్ లీడర్.

మునుగోడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటున్న, ఈ అపద్బాంధవుడికి మంత్రి పదవి దక్కకపోవడం ఆ ప్రాంత అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ​కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కఠినత్వం వీడి, మునుగోడు ప్రజల ఆకాంక్షను గుర్తించి, రాజగోపాల్ రెడ్డికి తగిన పదవిని ఇచ్చి గౌరవించాలి. అప్పుడే తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యానికి, నిబద్ధత కలిగిన నాయకత్వానికి గుర్తింపు లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు