మిర్యాలగూడ, (క్రైమ్ మిర్రర్): మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కోసం గ్రామపంచాయతీ స్థలం కేటాయించాలని అంబేద్కర్ యూత్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శి మాధవరెడ్డి, సర్పంచ్ బెడుదూరి వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఆయన ఆలోచనలు, స్ఫూర్తి మరింతగా చేరుతాయని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచుగంట్ల లింగయ్య, నందిపాటి ఆశీర్వాదం, నాగయ్య పాల్గొన్నారు.అలాగే అంబేద్కర్ యూత్ నాయకులు రేమడాల అచ్యుత్, కోట దుర్గ, మచ్చ మధు, గద్దల చరణ్, శ్రీకాంత్, చంటి తదితరులు పాల్గొన్నారు.
