కర్ణాటక రాష్ట్రంలోని హుణమూరు పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు విషాదాంతం కావడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
సమాచారం ప్రకారం, న్యూమారుతి బరంగాయ్ ప్రాంతానికి చెందిన హరీశ్ (49) ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య నిష్ట (36), ఇద్దరు పిల్లలు నిక్షా (12), రక్ష (8) ఉన్నారు.
సోమవారం రాత్రి సమయంలో హరీశ్ తన భార్య, పిల్లలను ఊపిరాడకుండా హత్య చేసి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా ఈ దారుణం బయటపడింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వ్యాపార సంబంధిత ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నప్పటికీ, అసలు కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనతో హుణమూరు పట్టణంలో విషాద వాతావరణం నెలకొంది.
also read: వరంగల్లో బంగారు దుకాణంపై బీఐఎస్ దాడులు – రూ.10 కోట్ల హాల్మార్క్ లేని ఆభరణాలు స్వాధీనం