జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 82 మంది ఉత్తమ టీచర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో ముచ్చటిస్తూ, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో వారు పోషించాల్సిన కీలక పాత్ర గురించి పలు ముఖ్యమైన సూచనలు చేశారు.ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో యువతను తీవ్రంగా వేధిస్తున్న డ్రగ్స్ మహమ్మారి పట్ల ఉపాధ్యాయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండాలని కోరారు. కేవలం అకడమిక్ చదువులకే పరిమితం కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగానే చదువుతో పాటుగా క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలకు పాఠశాలల్లో సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
పోలవరంతో తెలంగాణ గ్రామాలకు ముప్పు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆందోళన!
ప్రస్తుత రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవుతూ అధిక సమయం స్క్రీన్ (స్క్రీన్ టైమ్) కు కేటాయించడం పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ వ్యసనం కారణంగా విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించేందుకు టీచర్లు చొరవ తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, పిల్లల్లో మొబైల్ వినియోగాన్ని తగ్గించేలా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మోదీ ఉద్ఘాటించారు. రాబోయే తరాలను సన్మార్గంలో నడిపించే బాధ్యత టీచర్లదేనని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు.
కొన్ని సినిమాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి: సినీ నటుడు సుమన్ ఆందోళన
