Homeతెలంగాణతెలంగాణలో పోస్టర్ల రాజకీయం...!

తెలంగాణలో పోస్టర్ల రాజకీయం…!

  • బండి సంజయ్ కుమారుడు పరారీ అంటూ హైదరాబాదులో పోస్టర్లు

  • రాజకీయ రంగు పులుముకుంటున్న వివాదం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: బండి సంజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందా? కుమారుడి వివాదానికి రాజకీయరంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారా? దానిని నేరంగా చూడడం లేదా? రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా? బాధితురాలికి న్యాయం జరుగుతుందా? తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఈ వివాదం చుట్టూ రాజకీయ రంగు పులుముకున్నట్లు స్పష్టమవుతోంది.

ఫోక్సో కేసు నమోదు
బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదయింది. పోలీసులు ఎప్పటికీ ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాబోతుండడం వంటి పరిణామాలు జరుగుతుండగానే.. పరారీ లో ఉన్నట్లు పోస్టర్లు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి.

దీనిని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ఉద్దేశం కనిపిస్తోంది. నిందితుడి పై ఉన్న అభియోగాలను చట్టపరంగా విచారించాల్సింది పోయి.. ఇలా ప్రచారం కోసం వాడుకోవడం చూస్తుంటే కాస్త ఇబ్బందికరమే. ఇన్ని పరిణామాల నడుమ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బలమైన వాదనలు..
ఈ కేసుకు సంబంధించి భగీరథ్ తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించిన అంశాలు రాజకీయం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి. బాధితురాలు వయస్సు పై గతంలో ఉన్న రికార్డులను, రాష్ డ్రైవింగ్ కేసు చార్జి సీట్లను చూపిస్తూ అవి మేజర్ అని వాదనలు వినిపిస్తున్నారు. ఇవన్నీ కోర్టు పరిధిలో అంశాలైనప్పటికీ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును రాజకీయం చేయాలని చూడడం.. తాజాగా పోస్టర్లు వేసి ప్రచారం చేస్తుండడం గమనార్హం.

అయితే తాజా పరిణామాలతో బాధితురాలికి న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ అంశాలను జోడించి పక్కదారి పట్టిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. రాజకీయం అంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. కానీ ఒకరి కుటుంబం పై లక్ష్యంగా చేసుకొని ఈ పోస్టర్లు వేయడం సంస్కారం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ తీరు వల్ల నేరం పక్కదారి పట్టడమే కాకుండా.. బాధితురాలి ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పోస్టర్లు వేసిన వారు ఎవరు తమ పేర్లు మాత్రం రాయలేదు. కానీ దీని వెనుక రాజకీయ వ్యూహకర్తల ఐడియా ఒకటి ఉంటుందన్నది ఒక అనుమానం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు