దేశవ్యాప్తంగా టోల్ప్లాజాల వద్ద జరుగుతున్న అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. మొత్తం 14 ప్రాంతాల్లో అనధికారిక సాఫ్ట్వేర్, యాప్లను వినియోగించి టోల్ ఆదాయాన్ని పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగులోకి..
టోల్ప్లాజాల నిర్వహణకు సంబంధించిన లావాదేవీలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో పలు అవకతవకలు బయటపడినట్లు తెలుస్తోంది. అధికారిక వ్యవస్థకు భిన్నంగా పనిచేసే సాఫ్ట్వేర్ ద్వారా టోల్ వసూళ్లలో కొంత మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.
మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు
ఈ వ్యవహారంలో అక్రమంగా వచ్చిన నగదు ఏ విధంగా తరలించబడింది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరికి ప్రయోజనం చేకూరింది అనే అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం.
14 టోల్ప్లాజాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సాఫ్ట్వేర్ వినియోగం, వసూళ్ల వివరాలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై ఈడీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: చిత్తూరులో విషాదం.. విద్యుత్ షాక్తో ఏనుగు మృతి… విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
