క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- మాడ్గుల పీఎస్సిఎస్ బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ వినయ్ సాగర్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.వడ్ల తూకం, తరలింపు, చెల్లింపుల విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలని అగ్రికల్చర్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని తహసీల్దార్ వినయ్ సాగర్ స్పష్టం చేశారు.
Mamatha Benarjee: లాయర్ అవతారంలో దీదీ….!ఎన్నికల హింస కేసును వాదించేందుకు సుప్రీం కోర్టుకు….
Mamatha Benarjee: లాయర్ అవతారంలో దీదీ….!ఎన్నికల హింస కేసును వాదించేందుకు సుప్రీం కోర్టుకు….