Homeఅంతర్జాతీయంచైనాకు ప్రధాని మోడీ.. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి!

చైనాకు ప్రధాని మోడీ.. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి!

PM Modi China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగష్టులో చైనాకు వెళ్లనున్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌ లోని గాల్వాన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణతో చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయ. ఆ ఘటన తర్వాత తొలిసారి మోడీ చైనాకు వెళ్తున్నారు. అయితే, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నారు.

తియాంజిన్ వేదికగా శిఖరాగ్ర సమావేశాలు

చైనాలోని తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఈ సమావేశాలను నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు ఎస్‌సీఏ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక మోడీ చర్చలు

ఇక చైనా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దేశాధినేతలు చివరిసారిగా 2024 అక్టోబర్‌ లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలిశారు. మోడీ  పర్యటనకు ముందుగా చైనాలో భారత విదేశాంగ మంత్రి జైంశర్ పర్యటించారు. ఎస్‌సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తోనూ సమావేశం అయ్యారు. గత ఐదేళ్లలో జైశంకర్ చైనాలో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Read Also: భారత రక్షణ వ్యవస్థ.. సీడీఎస్ అనిల్ సంచలన వ్యాఖ్యలు!

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు