క్రైమ్ మిర్రర్, ఏపీ:- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, కాబోయే దంపతులకు అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరారు.అందిన వివరాల ప్రకారం, సోమలా సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడైన డాక్టర్ రఘురామ్ రెడ్డితో వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. వీరు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినప్పటికీ, వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కావడం విశేషం. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వైఎస్ షర్మిల కుటుంబంలో ఈ వివాహం ద్వారా కొత్త బంధం కుదురుతుండటంతో రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వివాహ తేదీ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్: లెక్కలు చూపకపోతే మూడేళ్ల జైలు, పదవి రద్దు!
సెన్సార్ బోర్డుపై ఆర్. నారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం.. మంచి సినిమాలను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి!
