Homeతెలంగాణమధుసూదన్ మరణం జర్నలిజం రంగానికి తీరని లోటు - మంత్రి కోమటిరెడ్డి..!

మధుసూదన్ మరణం జర్నలిజం రంగానికి తీరని లోటు – మంత్రి కోమటిరెడ్డి..!

  • రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేత..!

  • భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీపీఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ నిన్న సోమవారం మరణించారు. అయన పార్థివదేహంన్నీ అయన నివాసం మిర్యాలగుడ కు మంగళవారం తీసుకొచ్చారు. మరణ వార్త విన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు…

మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌లో గల మధుసూదన్ నివాసానికి చేరుకున్న మంత్రి, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి, వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని తక్షణ సాయంగా కుటుంబానికి అందజేశారు.

సందర్బంగా మాట్లాడారు..​ మధుసూదన్ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన జర్నలిస్ట్ అని మంత్రి కొనియాడారు. ఆయన మరణం జర్నలిజం రంగానికి, వ్యక్తిగతంగా తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి ప్రార్థించారు.

ప్రభుత్వం పరంగా మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మంత్రి వెంటా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస నేత, తదితరులు మధుసూదన్‌కు నివాళులు అర్పించారు.​

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు