Homeవైరల్రైలు క్యాబిన్‌ను హనీమూన్ సూట్‌గా మార్చిన జంట.. వీడియో వైరల్ – TTE సస్పెండ్!

రైలు క్యాబిన్‌ను హనీమూన్ సూట్‌గా మార్చిన జంట.. వీడియో వైరల్ – TTE సస్పెండ్!

ముంబై నుంచి నాందేడ్ వైపు వెళ్లుతున్న ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేను ఓ కొత్త దంపతులు హనీమూన్ సూట్‌లా అలంకరించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆనంద క్షణం చివరకు రైల్వే ఉద్యోగి సస్పెన్షన్‌కు దారి తీసింది.

జల్నాకు చెందిన నూతన దంపతులు తమ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఫస్ట్ ఏసీ క్యాబిన్‌ను పూర్తిగా మారుస్తూ బెలూన్లు, గులాబీ పూలు, రోజ్ పేటల్స్‌, లైట్లతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం ప్రైవేట్ డెకరేషన్ టీమ్‌ను కూడా రైలులోకి అనుమతించారు.

ఈ ప్రత్యేక అలంకరణకు సంబంధించిన వీడియోను ఆ జంట సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు ఈ రైలుకు ‘ఫస్ట్‌నైట్ ఎక్స్‌ప్రెస్’ అనే పేరు కూడా పెట్టారు. వీడియోకు భారీగా స్పందన వచ్చింది.

ఈ వీడియో రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఘటనను తీవ్రంగా పరిగణించారు. అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులను రైలులోకి అనుమతించడం, క్యాబిన్‌ను ఇలా మార్చడం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించారు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (TTE)ను వెంటనే సస్పెండ్ చేశారు. అదనంగా ఈ ఘటనపై పూర్తి స్థాయి శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

రైల్వే అధికారులు స్పష్టం చేసిన ప్రకారం, ప్రయాణికులు రైలులో భద్రత, నియమాలను పాటించాలి. ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. లేదంటే కఠిన చర్యలు తప్పవు.

also read: ప్రాణం పెట్టి కారును కాపాడిన యజమాని.. వరదలో కూడా వదలని పట్టుదల! వీడియో వైరల్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు