క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 78 స్థానాలు సాధించి మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సంచలన నిజం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనే బయటపడిందని కేటీఆర్ బాంబు పేల్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.భయంతోనే సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..సొంత సర్వేల్లో ఎదురైన ఈ చేదు నిజాలను చూసి తట్టుకోలేక, తీవ్ర భయాందోళనలతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, వారి వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణలో కాసేపట్లో వర్షాలు: పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక!
తమిళనాడులో రాజ్యాంగ వివాదం…! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాను కోరిన విజయ్ సర్కార్ …