క్రైమ్ మిర్రర్, ఏపీ :- మాజీ రాజ్యసభ సభ్యుడు, ఒకప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన విజయసాయిరెడ్డి మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తిరిగి పార్టీ గూటికి చేరతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన, ఇప్పుడు మళ్లీ చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విజయసాయిరెడ్డి రాకకు వైసీపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీకి సంబంధాలు దెబ్బతిన్నాయి. గతంలో ఢిల్లీ స్థాయిలో విజయసాయిరెడ్డికి ఉన్న విస్తృతమైన పరిచయాలు, నెట్వర్క్ ఇప్పుడు పార్టీకి అత్యంత అవసరమని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన ద్వారా బీజేపీ పెద్దలతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చని, తద్వారా జాతీయ స్థాయిలో పార్టీని పటిష్టం చేయవచ్చనే భావన వైసీపీలో వ్యక్తమవుతోంది. అయితే, గతంలో ఆయనను జగన్ కోటరీగా అభివర్ణించి, ఆయన నిర్ణయాలను తీవ్రంగా విమర్శించిన వైసీపీలోని కొందరు సీనియర్ నేతలు ఇప్పుడు విజయసాయిరెడ్డి పునరాగమనంపై, ఆయనకు దక్కబోయే ప్రాధాన్యతపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
భూ వివాదం బలిగొన్న బంధం.. అన్న చేతిలో తమ్ముడు హతం
ఆన్లైన్ గేమ్స్ కారణంగా అప్పులు.. చార్టర్డ్ అకౌంటెంట్ బలవన్మరణం
