క్రైమ్ మిర్రర్, అమరావతి:- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆమెకు పొత్తికడుపు సర్జరీ జరిగినట్లు స్వయంగా ఆమే వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఒక ఫోటోను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు.ప్రస్తుతం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉన్నానని, ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. ఐసీయూ బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో ఉన్న ఫోటోను షేర్ చేసిన షర్మిల, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. “నేను క్షేమంగానే ఉన్నాను, ప్రస్తుతం కోలుకుంటున్నాను” అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు.ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన వారందరికీ, తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.వైఎస్ షర్మిల అకస్మాత్తుగా ఆసుపత్రి పాలు కావడం, సర్జరీ జరగడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమె స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సందేశం ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆమె, వీలైనంత త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
గన్తో బెదిరించి ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు..
పెంపుడు గేదె దాడిలో వ్యక్తి మృతి.. రాజేంద్రనగర్లో విషాదం
