కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యనమలకుదురులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ (41) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఆయన ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
రాజేశ్ విజయవాడ సిటీ 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు.
అయితే రాజేశ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: ఆస్పత్రి నుంచి అన్నా హజారే డిశ్చార్జ్.. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందన్న వైద్యులు
