క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది (2027) సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల పర్చూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన అంతర్గత సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు తీపికబురు.. గరిష్ట వయోపరిమితి పెంపు!
ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం ప్రజలతో మమేకం అవ్వడమే. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన పాదయాత్ర పార్టీకి ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే. అదే తరహాలో మళ్లీ జనాదరణ పొందాలని ఆయన భావిస్తున్నారు.పాదయాత్ర ప్రకటనతో పాటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కూడా జగన్ దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, మరియు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ద్వారానే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగలమని ఆయన క్యాడర్కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా, ఈ పాదయాత్ర నిర్ణయంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంది.
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
