ఉత్తరప్రదేశ్లోని మథురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలు దంపతుల మధ్య తీవ్ర విభేదాలకు దారితీయడంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
మథురకు చెందిన జగ్దేవ్ అనే వ్యక్తి.. ఇంట్లోనే తన భార్య పూజతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అతడు ఆమె గొంతు నులిమినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన పూజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
కాగా, దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని వారి 10 ఏళ్ల కుమారుడు సిద్ధాంత్ పోలీసులకు తెలిపాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో నెలకొన్న పరిస్థితులపై బాలుడు పోలీసులకు వివరాలు చెప్పాడు.
భార్య మృతిచెందిన విషయం బయటకు రావడంతో జగ్దేవ్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా? మరేదైనా అంశం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు తీపికబురు.. గరిష్ట వయోపరిమితి పెంపు!
