Homeవైరల్రూ.500 కోసం 8 గంటలు నిలబడిన సమంత..!

రూ.500 కోసం 8 గంటలు నిలబడిన సమంత..!

Crime Mirror, Cinema Updates: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభును చూస్తే ఇప్పుడు గ్లామర్, స్టార్‌డమ్, సక్సెస్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఒకప్పుడు పాకెట్ మనీ కోసం రోజుకు రూ.500 సంపాదించేందుకు గంటల తరబడి నిలబడి పనిచేసిన సమంత.. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమంత, ఇటీవల ఓ కార్యక్రమంలో తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని అనుకున్నానని, అందుకే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేదాన్నని తెలిపింది.

Also Read: విశాఖలో మహేష్ బాబు సందడి…!

హోటళ్లలో జరిగే పెళ్లిళ్లు, ఫంక్షన్లలో అతిథులకు స్వాగతం పలికే రిసెప్షన్ టీమ్‌లో పనిచేసినట్లు సమంత వెల్లడించింది. వచ్చిన అతిథులకు స్వాగతం చెబుతూ, పన్నీరు చల్లే పని చేసేదాన్నని చెప్పింది. ఆ పనికి రోజుకు రూ.500 ఇచ్చేవారని, కానీ ఆ డబ్బు సంపాదించాలంటే దాదాపు ఎనిమిది గంటల పాటు నిరంతరం నిలబడాల్సి వచ్చేదని గుర్తు చేసుకుంది.

తనను చూసి ఇద్దరు స్నేహితులు కూడా అదే పని చేయడానికి వచ్చారని, అయితే కేవలం ఐదు నిమిషాల్లోనే అది తమ వల్ల కాదని వెళ్లిపోయారని నవ్వుతూ చెప్పింది. కానీ తనకు మాత్రం ఏదో ఒకటి సాధించాలనే తపన ఉండేదని, అందుకే కష్టాన్ని లెక్కచేయకుండా పని చేసేదాన్నని తెలిపింది.

Also Read: కాంగ్రెస్ మాట‌తప్ప‌డంపై తీవ్ర నిరాశ‌లో ష‌ర్మిళా…?

సమంత చదువులో కూడా చాలా మెరుగైన విద్యార్థిని. ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని కలలు కన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మోడలింగ్, ఆడిషన్ల వైపు అడుగులు వేసింది. ఆ ప్రయత్నాలే చివరకు ఆమెను సినిమా ప్రపంచానికి తీసుకువచ్చాయి.

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దూకుడు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, రంగస్థలం, ఓ బేబీ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన సమంత కథ చూస్తే.. కష్టపడే వారికి విజయం తప్పకుండా దక్కుతుందనే విషయం మరోసారి స్పష్టమవుతోంది.

Also Read: AP Teachers: ఆ 29 మంది టీచర్లకు బంపర్ ఛాన్స్..!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు