క్రైమ్ మిర్రర్,తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ వంటి పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు (Heatwaves) వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 45 నుండి 47 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి.
ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అత్యవసర పనులు ఉంటే తప్ప ఈ సమయంలో వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు బయటకు రాకపోవడం సురక్షితం.
దాహం వేయకపోయినా ప్రతి గంటకు సరిపడా నీరు, మజ్జిగ, లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. తేలికపాటి, లూజ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా రుమాలు ఉపయోగించాలి. వాతావరణ శాఖ తాజా అప్డేట్స్ ప్రకారం ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో కూడా వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంది.