Homeఆంధ్ర ప్రదేశ్ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి!

ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఈ నెల 10వ తేదీన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స (సర్జరీ) పూర్తి చేసిన సంగతి తెలిసిందే.నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం..భుజానికి సర్జరీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలోనే నాలుగు రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో నేడు వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయన తన నివాసానికి చేరుకున్నారు.ఇటీవలే ముంబై వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తిగా కోలుకుని, మునుపటి ఉత్సాహంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడతారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన శ్రేణులు, కూటమి నేతలు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Navi Mumbai Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసీ…11 నెలల తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు

Navi Mumbai Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసీ…11 నెలల తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు