క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- జపాన్ను తీవ్రమైన భూకంపం పలకరించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొడుకుతో బీచ్లో… వైరల్గా మారిన వీడియో…!
క్షతగాత్రులు & ప్రాణ నష్టం:-
భూకంప ప్రకంపనల తీవ్రతకు అనేక బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్ క్షణాల్లో నేలమట్టమయ్యాయి.మృతుల సంఖ్య: 18 మంది (అధికారికంగా ధృవీకరించబడినవి),గాయపడినవారు: 62 మందికి పైగా (వీరిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది). కూలిపోయిన నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలలో భారీగా పౌరులు చిక్కుకుపోయారు.ముమ్మరంగా సహాయక చర్యలుసంఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు, అత్యవసర సేవా రక్షకులు శ్రమించి శిథిలాల తొలగింపు చర్యలు చేపడుతున్నారు. అధునాతన యంత్రాల సహాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.బాధితులకు తక్షణ వైద్య సదుపాయాలు అందిస్తూ, తాత్కాలిక పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రకంపనల భయంతో ప్రజలు రోడ్లపైనే కాలం గడుపుతున్నారు.
షుగర్ వ్యాధిగ్రస్తులకు వేప పండ్లు వరప్రసాదం.. కానీ మోతాదు మించితే ప్రమాదమే!
