Homeక్రీడలుBCCI గుస్సా.. ఇండియాకు రాగానే సమీక్ష!ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ అసంతృప్తి!

BCCI గుస్సా.. ఇండియాకు రాగానే సమీక్ష!ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ అసంతృప్తి!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఆటతీరుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పర్యటన ముగిసిన వెంటనే జట్టు ప్రదర్శనపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.జూలై 19న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు ఇండియాకు తిరిగి రాగానే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా టీ20 సిరీస్‌లో జరిగిన తప్పులపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.అయితే, రాబోయే వన్డే సిరీస్‌లో భారత జట్టు తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియా తిరిగి గాడిలో పడుతుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌తో శ్రీలీల భారీ ఆదాయం… ఒక్క ప్రమోషనల్ పోస్ట్‌కే లక్షల్లో రెమ్యూనరేషన్…!

తిరుమల అలిపిరి మార్గంలో చిరుత కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు