క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలి నడకన వెళ్లే అలిపిరి మార్గంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకమార్గంలోని శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం రాత్రి (నిన్న రాత్రి) ఓ చిరుత సంచరించడం భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.రాత్రి సమయంలో నడకమార్గంలో వెళ్తున్న భక్తులు.. దారిలో అకస్మాత్తుగా చిరుతను చూసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. భక్తుల కేకలతో వెంటనే అప్రమత్తమైన టీటీడీ (TTD) భద్రతా సిబ్బంది, అటవీశాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.భయభ్రాంతులకు గురైన భక్తులను సముదాయించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి భక్తులు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో భక్తులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.ఈ ఘటన నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా అటవీశాఖ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చిరుత సంచరించిన ప్రాంతంలో నిఘా పెంచడంతో పాటు, గస్తీని ముమ్మరం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏటీఎం కార్డు ఉన్నవారికి శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా – ఎలా పొందాలి?
ఒక్క పోస్ట్ కి ఇన్నీ లక్షలా?.. వామ్మో శ్రీలీల!