Homeఆంధ్ర ప్రదేశ్సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర సరుకుల ధరలు!

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర సరుకుల ధరలు!

దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నాయి. కిచెన్‌లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన వాతావరణం నెలకొంది. బియ్యం, చక్కెర, పప్పు ధాన్యాలు, వంట నూనెలు ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ధరలు అమాంతం దూసుకెళ్తున్నాయి. నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా, రెండు నెలల క్రితం వరకు కిలో నాణ్యమైన బియ్యం రూ.45 నుంచి రూ.50 మధ్య ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.70కి చేరింది. ఇక సామాన్యులు నిత్యం వాడే చక్కెర ధర రూ.45 నుంచి ఏకంగా రూ.60 – రూ.70 వరకు ఎగబాకింది. మరోవైపు కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాల ధరలు కిలోపై సుమారు రూ.20 వరకు పెరిగాయి. కూరగాయలు, కిరాణా సరుకులతో పాటు వంటనూనె ధరలు లీటరుకు రూ.20 వరకు అధికం కావడంతో ఇళ్ల నిర్వహణ భారంగా మారిందని గృహిణులు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, వర్షాభావం, పంట దిగుబడులు తగ్గడం వంటి కారణాల వల్లనే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, పేద, సామాన్య ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాలను ప్రజలు కోరుతున్నారు.

పోస్టర్ల వార్!

ఏపీలో వినాయక చవితి వేడుకలకు గుడ్‌న్యూస్: గణేష్ మండపాలకు ఆన్‌లైన్‌లోనే సింగిల్ విండో అనుమతులు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు