క్రైమ్ మిర్రర్, సినిమా:- ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్ సే తాను నటించినటువంటి టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తెలుగులో ఎవరైతే హీరోలతో నటించానో.. ఆ హీరోల నుంచి ఒక్కొ విషయాన్ని నేర్చుకున్నాను అని అన్నారు. మొదటగా రవితేజతో ప్రారంభించిన హీరోయిన్ భాగ్యశ్రీ.. రవితేజ నుంచి సహనాన్ని నేర్చుకోవచ్చు అని తెలిపారు. మరోవైపు విజయ్ దేవరకొండ నుంచి సినిమాకు పడే తపన ఎలా ఉంటుందో అనేది నేర్చుకున్నాను అని తెలిపారు. ఇకపోతే హీరో రామ్ నుంచి మంచిగా యాక్టింగ్ మరియు డాన్సింగ్ స్టైల్ నేర్చుకోవచ్చు అని.. అన్నారు. దుల్కర్ సల్మాన్ ఒక సీనియర్ యాక్టర్ అయినప్పటికీ కూడా ప్రతి సినిమాలో ఒక కొత్త నటుడి కోణంలోనే ఆలోచిస్తారు అని అన్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ భాగ్యశ్రీ బోరుసే అక్కినేని అఖిల్ తో లెనిన్ అనే సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ తరుణంలో ఈ మరాఠి హీరోయిన్ అయినటువంటి భాగ్యశ్రీ మన టాలీవుడ్ హీరోల గురించి మంచిగా మాట్లాడటం అనేది తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈమెపై మరింత అభిమానం పెరిగింది.
మోడీ పిలుపు.. కాన్వాయ్ లను సగానికి తగ్గించిన ఏపీ నాయకులు!
రక్షణ రంగానికి కేంద్రబిందువు కానున్న ఏపీ…!పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ…