Homeతెలంగాణసమ్మక్క సారలమ్మ హుండీ లెక్కింపు..

సమ్మక్క సారలమ్మ హుండీ లెక్కింపు..

తొలి రోజు రూ.2.49 కోట్ల ఆదాయం

ములుగు,క్రైం మిర్ర‌ర్ : స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ జాత‌ర‌కు సంబందించి తొలి రోజు 125 హుండీల‌ను లెక్కించారు . 125 హుండీల లెక్కింపులో రూ.2,49,65,000 నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భ‌క్తులకోర్కెలు తీర్చే కొంగు బంగార‌మైన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ల‌కు న‌గ‌దు రూపంలో కానుక‌లు స‌మ‌ర్పించారు. దీంతో ఆదాయం ఎక్కువ‌గానే పెరిగింది. ఈ హుండీ లెక్కింపు అంతా దేవ‌దాయ‌శాఖ‌,సేవాస‌మితి ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగుతుంద‌ని తెలిపారు. న‌గ‌దుతో పాటు భ‌క్తులు స‌మ‌ర్పించిన బంగారు,

వెండి కానుక‌ల‌ను వేరు చేశారు. లెక్కింపు పూర్త‌యిన బంగారం, వెండి, ఇనుప హుండీల్లో భ‌ద్ర‌ప‌ర‌చి తాళాలువేసి భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. రానున్న‌రోజుల్లో ఇదే విధంగా మిగిలిన‌ హుండీ లెక్కింపు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు