క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లలో వయోపరిమితిని పెంచే దిశగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా సరైన నోటిఫికేషన్లు లేవని నిరుద్యోగులు విన్నవించడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతిని అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది బలహీన వర్గాల మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.