Homeక్రైమ్ఏడాది తర్వాత ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో షాకింగ్ ఘటన!

ఏడాది తర్వాత ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో షాకింగ్ ఘటన!

క్రైమ్ మిర్రర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ డుప్లెక్స్ ఇంట్లో మహిళ అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె మరణించి దాదాపు ఏడాది అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలిని 52 ఏళ్ల దాక్షాయిణిగా గుర్తించారు. హవనూర్ లేఔట్‌లోని తన సొంత డుప్లెక్స్ ఇంట్లో ఆమె ఒంటరిగా నివసించేవారు. కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె.. ఆ తర్వాత తన కుమారుడిని కూడా క్యాన్సర్ కారణంగా కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వరుస విషాదాలతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం.

దాక్షాయిణికి ఓ కుమార్తె ఉన్నప్పటికీ.. కుటుంబ విభేదాల కారణంగా తల్లి, కుమార్తె మధ్య చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు లేవని తెలుస్తోంది. కుమార్తె, అల్లుడితో విభేదాలు ఉండటంతో ఆమెను వారు తరచూ సంప్రదించలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా దాక్షాయిణి తన ఫోన్ నంబర్‌ను కూడా మార్చుకోవడంతో బయటివారితో ఆమెకు సంబంధాలు మరింత తగ్గిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లోనే మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతదేహం గురించి చాలాకాలం ఎవరికీ సమాచారం లేకపోవడంతో ప్రస్తుతం అక్కడ అస్థిపంజరం మాత్రమే లభించింది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారు. అస్థిపంజరానికి సంబంధించిన పరీక్షలు, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే దాక్షాయిణి మరణానికి అసలు కారణం ఏమిటనేది స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు