Homeఆంధ్ర ప్రదేశ్అకౌంట్లోకి రూ.13వేలు.. 'తల్లికి వందనం' దరఖాస్తులకు ఆగస్టు 3 వరకు అవకాశం!

అకౌంట్లోకి రూ.13వేలు.. ‘తల్లికి వందనం’ దరఖాస్తులకు ఆగస్టు 3 వరకు అవకాశం!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమైన గమనిక. అర్హత ఉండి కూడా ఇంతవరకు ఈ పథకం కింద రూ.13,000 ఆర్థిక సహాయం అందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.దరఖాస్తు విధానం మరియు గడువు:పథకం డబ్బులు అందని అర్హులు ఆగస్టు 3వ తేదీలోగా తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.ఆగస్టు 3 వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం, అర్హులైన వారితో అదనపు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తారు.

చంద్రగిరిలో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య- పోలీసుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల నిరసన

కొత్తగా అర్హత సాధించిన వారితో పాటు, ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్‌లో తాజాగా చేరిన విద్యార్థుల జాబితాలను ఆగస్టు 30వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు.జాబితాలు విడుదల చేసిన రోజే, అనగా ఆగస్టు 30న, అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం కింద రెండో విడత నగదు (రూ.13,000) జమ కానుంది. కాబట్టి, ఇంకా లబ్ధి పొందని వారు వెంటనే సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.

ఒకే కారు విధానం: కేంద్రం కొత్త నిర్ణయం – ఖర్చుల తగ్గింపే లక్ష్యం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు