క్రైమ్ మిర్రర్, జాతీయం:-నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి జనసేన కార్యకర్తల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. చట్టపరమైన చర్యలు ఒకవైపు కొనసాగుతుండగా, వ్యక్తులపై దాడులకు ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో, కొంతమంది జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలపై స్పందించిన ప్రకాష్ రాజ్, “ప్రశ్నించిన వారిని బెదిరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలి” అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
పర్యాటకులకు గుడ్ న్యూస్.. కృష్ణానదిలో ఇక సోలార్ బోట్ల సందడి.. !
అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలను విస్మరించి, కేవలం అభిమానులపై మాత్రమే విమర్శలు చేయడం సరైంది కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రావణ్ మాట్లాడిన వివాదాస్పద వీడియోలను షేర్ చేస్తూ తమ వాదనను వినిపిస్తున్నారు.ఇదిలా ఉంటే, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో ఇరువైపులా సంయమనం అవసరమని అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సరైన మార్గమేనని, అయితే ఎవరైనా వ్యక్తిగతంగా దాడులకు దిగడం లేదా హింసాత్మక చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వాదోపవాదాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు – ఏడుగురు అధికారుల సస్పెన్షన్