క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు (Musi River Rejuvenation Project) కోసం కేబినెట్ సబ్-కమిటీ కొన్ని కీలక మార్గదర్శకాలు మరియు లక్ష్యాలను నిర్దేశించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం నదిని ప్రక్షాళన చేయడమే కాకుండా, నగరం యొక్క రూపురేఖలను మార్చి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం.
ఈ ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే సాకారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీవాహక ప్రాంత ప్రజలకు కనీస నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. నదికి ఇరువైపులా 30 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. దీనితో పాటు 9 మీటర్ల సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేసి, వీటిని ప్రధాన జాతీయ రహదారులకు (విజయవాడ, ముంబై, బీజాపూర్) అనుసంధానం చేస్తారు.
నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ పాటించాలని నిర్దేశించారు. గండిపేట నుండి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 14 మండలాలు మరియు 46 గ్రామాల్లో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతారు. హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు (9.2 కి.మీ).
ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు (11.8 కి.మీ). ఈ పునరుజ్జీవన పనులను 2026 ఆగస్టు నాటికి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 7,055 కోట్లు కేటాయించే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టు కేవలం అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం పరిగణిస్తోంది.