క్రైమ్ మిర్రర్, సినిమా:- మాస్ మహారాజ రవితేజ కెరీర్లో ఇరుముడి సినిమా ప్రత్యేకంగా నిలిచింది. వరుస పరాజయాలతో కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోలేకపోయిన రవితేజకు ఈ చిత్రం మంచి కమ్బ్యాక్గా మారింది. తండ్రీకూతురు అనుబంధం, భక్తి అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే ఇరుముడి కథ మొదట రవితేజ కోసం అనుకున్నది కాదనే విషయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కథను దర్శకుడు శివ నిర్వాణ ముందుగా మరో స్టార్ హీరోకు వినిపించినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు కింగ్ నాగార్జున. దర్శకుడు శివ నిర్వాణ తొలుత నాగార్జునను కలిసి ఇరుముడి కథను వివరించారట. కథ నచ్చినప్పటికీ, అప్పట్లో డేట్స్ సర్దుబాటు చేయడం కష్టంగా ఉండటంతో నాగార్జున ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత ఈ కథ రవితేజ దగ్గరకు వెళ్లగా ఆయనకు నచ్చడంతో సినిమాను చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇరుముడి మంచి టాక్తో దూసుకెళ్తుండటంతో నాగార్జున ఈ సినిమాను చేసి ఉంటే ఎలా ఉండేదనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. నాగార్జున అభిమానులు, రవితేజ అభిమానులు తమదైన రీతిలో ఈ విషయంపై స్పందిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్కు NIA సమన్లు.. పాక్ లో ఉన్న సయీద్కు నోటీసులు పంపేందుకు సిద్ధం
ఇక ఇరుముడి తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలోనూ మంచి జోరు చూపించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు ఓవర్సీస్లోనూ సినిమాకు స్పందన లభించినట్లు సమాచారం. బుక్మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్ఫామ్లలో టికెట్ బుకింగ్స్కు కూడా మంచి స్పందన వచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది.ఇరుముడిలో రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది.మొత్తానికి నాగార్జున చేయాల్సిన కథ రవితేజ చేతికి రావడం, అదే సినిమా ఆయనకు కమ్బ్యాక్ అందించడం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
