‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కనున్న ‘బ్రహ్మాస్త్ర 2’ పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తొలి భాగానికి కొనసాగింపుగా రానున్న ఈ సినిమాలో కథ మరింత విస్తృతంగా, భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరో రణ్బీర్ కపూర్ శివ, దేవ్ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు ఆలియా భట్ ఇషా పాత్రను మరోసారి పోషించనున్నారు. దేవ్కు సంబంధించిన కథలో కీలకంగా ఉండే అమృత పాత్ర కోసం దీపికా పదుకొణెతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సీక్వెల్ను మరింత భారీగా రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘రామాయణం’ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న రణ్బీర్ కపూర్.. ఆ సినిమా పనులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నుంచి ‘బ్రహ్మాస్త్ర 2’ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే దీపికా పదుకొణె అమృత పాత్రలో నటించే విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read: కదులుతున్న కంటైనర్ లారీపై డ్రైవర్ డ్యాన్స్.. వైరల్గా మారిన వీడియో
