భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశ విదేశాంగ విధానంపై చేసిన కీలక వ్యాఖ్యలకు అంతర్జాతీయ స్థాయిలో, మరీ ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా నుండి అనూహ్యమైన మద్దతు లభించింది. ప్రపంచ దేశాల రాజకీయాల్లో భారత్ ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేకమైన, “స్వతంత్ర విదేశాంగ విధానాన్ని” అనుసరిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ బలమైన ప్రకటనను చైనా ప్రభుత్వం హృదయపూర్వకంగా స్వాగతించింది. ముఖ్యంగా, భారత్ మరియు చైనా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలలో ఎలాంటి ఇతర దేశాల లేదా మూడో పక్షం ప్రమేయం ఉండకూడదన్న మోదీ వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ ప్రశంసలు కురిపించింది.
పొంగులేటితో డ్యామేజ్…! తీవ్ర ఆవేదనలో సీఎం రేవంత్..
ప్రధాని మోదీ చేసిన ఈ దౌత్యపరమైన ప్రకటనలకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, వాటికి ఎంతో విలువిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికారికంగా స్పష్టం చేసింది. ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్, చైనాలు భవిష్యత్తులో వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది.ఈ పరిణామాలపై చైనా విదేశాంగ ప్రతినిధి గోవా జియాకున్ స్పందిస్తూ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆలోచనలను మీడియాకు వెల్లడించారు. “రెండు దేశాలు కేవలం పొరుగు దేశాలుగానే కాకుండా సుదీర్ఘకాలం పాటు అభివృద్ధిలో మంచి భాగస్వాములుగా ఉండాలి. ఒకరి సర్వతోముఖాభివృద్ధికి మరొకరు మద్దతు ఇచ్చుకోవాలి. అలాగే, పరస్పర బలాలతో రెండు దేశాలు ఉమ్మడిగా ప్రయోజనం పొందాలన్నదే జిన్పింగ్ ప్రధాన లక్ష్యం” అని జియాకున్ స్పష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలపడవచ్చని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
‘రణబాలి’ రిలీజ్ వాయిదా వార్తలకు చెక్.. ముహూర్తం మార్చేదే లేదన్న మేకర్స్!
