Homeతెలంగాణరాష్ర్ట ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌టి క‌బురు...ఐదు రోజులు వ‌ర్షాలు...!

రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌టి క‌బురు…ఐదు రోజులు వ‌ర్షాలు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్:  తెలంగాణ రాష్ర్టంలో భానుడి భ‌గ‌భ‌గ‌లు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు నమోదవుతున్న త‌రుణంలో వాతావ‌ర‌న శాఖ చ‌ల్ల‌టి వార్త చెప్పింది.రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక జిల్లాలో వేసవిఎండలు అదరగొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా 14జిల్లాల్లో 40డిగ్రీలసెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో పశ్చిమ కనుమలు ఉన్న జిల్లాలు, దక్షిణ తమిళనాడు కోస్తాతీర, డెల్టా జిల్లాల్లో ఒకటి రెండురోజుల్లో తేలికపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 29వ తేదీ నుంచి పశ్చిమ కనుమ జిల్లాల్లో తేలిక పాటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, 30న నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్‌, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు