పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాణిగంజ్లో సంచలనం కలిగించే ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై ఓ యువతిపై ముగ్గురు మహిళలు దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం ప్రకారం, బాధిత యువతిని లక్ష్యంగా చేసుకుని ఆమెను కొట్టడమే కాకుండా అవమానకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని యువతిని రక్షించారు. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల మధ్య ఇలా హింసాత్మక ఘటనలు జరగడం బాధాకరమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. దాడికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
also read: హైదరాబాద్లో విషాదం: కూకట్పల్లి మెట్రో వద్ద టిప్పర్ ఢీకొని ఇద్దరు మైనర్ల మృతి
