విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే ప్రచారం మొదలైంది.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత పకడ్బందీగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని అనుకున్న తేదీ కంటే ఒకటి లేదా రెండు వారాలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9 లేదా అక్టోబర్ 16 తేదీల్లో ఏదో ఒక తేదీని కొత్త రిలీజ్ డేట్గా ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా విడుదల తేదీ మారుతుందా? లేదా అక్టోబర్ 2కే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత రానుంది.
వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read: హాస్టల్లో కలకలం.. మైసూరు బొండాలు తిని 61 మంది విద్యార్థులకు అస్వస్థత
