మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ రూపంలో మరో భారీ విజయం దక్కినట్లు తెలుస్తోంది. విడుదలైన రెండో వారంలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రెండో శుక్రవారం నమోదైన వసూళ్లు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
రెండో శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ సుమారు రూ.11.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో గతంలో ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’, ‘బాహుబలి 2’ వంటి చిత్రాలు సాధించిన రెండో శుక్రవారం వసూళ్లను ఈ సినిమా అధిగమించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ జాబితాలో ప్రస్తుతం ‘RRR’ రూ.14.5 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ‘ఇరుముడి’ రూ.11.5 కోట్లతో తదుపరి స్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. రెండో వారంలోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సినిమాకు కలిసొస్తోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ‘ఇరుముడి’ కలెక్షన్లు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇది రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినట్లు సమాచారం.
వరుస విజయాల కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రెండో వారంలోనూ వసూళ్లలో పెద్దగా తగ్గుదల కనిపించకపోవడంతో.. ఫుల్ రన్లో సినిమా మరింత దూరం వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
also read: రేవ్ పార్టీలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
