క్రైమ్ మిర్రర్,సినిమా:- ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో ఒకరు వెంకీ అట్లూరి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఒకప్పుడు హీరోగా కూడా నటించారనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఆయన గతాన్ని గుర్తు చేయడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.సందీప్ కిషన్ పక్కన కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అతడే దర్శకుడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తూ విజయాలు అందుకుంటున్న ఆయన.. కెరీర్ ప్రారంభంలో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోవడంతో దర్శకత్వం వైపు అడుగులు వేశారు.హైదరాబాద్లో పుట్టి పెరిగిన వెంకీ అట్లూరికి చిన్నప్పటి నుంచే కథలు, రచనపై ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తితోనే సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన జ్ఞాపకం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత స్నేహగీతం సినిమాలోనూ నటించారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నటనకు గుడ్బై చెప్పి రచన, దర్శకత్వంపై దృష్టి పెట్టారు.
పవన్ కళ్యాణ్ ‘OG-2’ అప్డేట్: వాయిదాల్లేవు.. అనుకున్న టైమ్కే షూటింగ్ షురూ!
ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత వంటి సినిమాలకు డైలాగ్స్ అందించి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో వెంకీ అట్లూరి పేరు ఇండస్ట్రీలో మార్మోగింది. ఆయన ప్రతిభను మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా అభినందించినట్లు గతంలో వెల్లడించారు.తర్వాత ధనుష్తో సార్ సినిమాను తెరకెక్కించి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ రూపొందించారు. బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు వెంకీ అట్లూరికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.ఇప్పుడు సూర్య హీరోగా తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో మమితా బైజు కథానాయికగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఒకప్పుడు హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన వెంకీ అట్లూరి.. ఇప్పుడు వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్గా ఎదగడం ఆసక్తికరంగా మారింది.
మిస్టర్ పర్ఫెక్ట్ కాపీరైట్ వివాదం.. దిల్ రాజుకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట!
