క్రైమ్ మిర్రర్,తమిళనాడు:- తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా వెండితెరకు పరిచయం చేసే ప్రణాళికలో ధనుష్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.సినీ వర్గాల సమాచారం ప్రకారం, యాత్ర తొలి చిత్రాన్ని ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ధనుష్కు చెందిన వండర్బార్ ఫిల్మ్స్తో పాటు ఆర్టేక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం యాత్ర నటన, డ్యాన్స్లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి అవసరమైన అన్ని అంశాలపై అతడికి ట్రైనింగ్ అందిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే స్క్రీన్ టెస్ట్లు, లుక్ టెస్ట్లు కూడా నిర్వహించే అవకాశముందని కోలీవుడ్ మీడియా పేర్కొంటోంది.
ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్ పని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెల్రాజ్ కెమెరా బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో ప్రాజెక్ట్పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ధనుష్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల షూటింగ్లను పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ తండ్రి దర్శకత్వంలో కొడుకు హీరోగా పరిచయం అవుతాడనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.సినీ కుటుంబాల నుంచి వారసుల ఎంట్రీలు కొత్త విషయం కాకపోయినా, నటుడిగా, దర్శకుడిగా విజయవంతమైన ధనుష్ తన కుమారుడిని ఎలా పరిచయం చేస్తాడన్న ఆసక్తి మాత్రం అందరిలో కనిపిస్తోంది. అధికారిక ప్రకటన వస్తే ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారే అవకాశాలు ఉన్నాయి.