క్రైమ్ మిర్రర్, ఏపీ:- స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప ప్రదేశం ఉత్తరాంధ్ర అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కొనియాడారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలపై, విమర్శకులపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.’ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు అవసరమా అని గతంలో కొంత మంది హేళన చేశారు. ఉత్తరాంధ్రను తక్కువగా చూశారు. ఇక్కడి ప్రజలను అవమానించారు.’ అని లోకేష్ మండిపడ్డారు. ‘కానీ ఇప్పుడు ఎర్రబస్సు రాని చోటుకు ఎయిర్ పోర్టు వచ్చింది, ఎయిర్ బస్ వచ్చింది, సాక్షాత్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు’ అని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా లోకేష్ స్పష్టం చేశారు. ఇదే వేదికగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రతిపక్ష పార్టీ వైసిపి పై కౌంటర్లు వేశారు.
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 59కి చేరిన బాధితుల సంఖ్య
రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి…! హైకోర్టు
