Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీలో జాడలేని అనిల్ కుమార్ యాదవ్...!

వైసీపీలో జాడలేని అనిల్ కుమార్ యాదవ్…!

  • పార్టీ కోఆర్డినేటర్ల సమావేశానికి గైర్హాజరు

  • తాడేపల్లి వైపు రాని మాజీమంత్రి

  • జగన్ దూరం పెట్టారా? ఆయనే దూరం జరిగారా?

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? ఉంటే కనిపించరు ఎందుకు? మిగతా నేతలు యాక్టివ్ అయినా ఆయన ఎందుకు కావడం లేదు? జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు ఇవ్వలేదా? లేకుంటే కేసులకు భయపడి ఆయన బయటకు రావడం లేదా? పొలిటికల్ సర్కిల్స్లో ఇదే ఆసక్తికర చర్చ.

దాదాపు నేతలంతా హాజరు..
ఇటీవల జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దాదాపు వైసీపీ నేతలు అంతా హాజరయ్యారు. చివరకు అనారోగ్యంతో బాధపడుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి నేతలు కూడా వచ్చారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అయితే అందరూ కనిపించారు కానీ.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆయన ఎందుకు హాజరు కావడం లేదన్న అంశంపై సొంత పార్టీ నేతలే చర్చించుకున్నారు. జగన్ దూరం పెట్టారా? లేకుంటే ఆయనే దూరం జరిగారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఫైర్ బ్రాండ్ ముద్ర..
వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదువ లేదు. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్.. ఇలా అంతా యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కానీ మొన్నటి కోఆర్డినేటర్ల సమావేశానికి అంతా హాజరయ్యారు.

కానీ అనిల్ కుమార్ యాదవ్ జాడలేదు. అయితే ఆయనను జగన్ దూరం పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ . ఓటమి ఎదురయ్యేసరికి అటువైపుగా చూడడం మానేశారు. అడపాదడపా నెల్లూరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్తుంటారు. గత కొంతకాలంగా అది లేదు.

అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉన్న ఆయనను ఎంపీగా పోటీ చేయించారు. ఓడిపోయిన తర్వాత అనిల్ తిరిగి సిటీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. అందుకు జగన్ అంగీకరించకపోవడంతోనే అనిల్ కుమార్ యాదవ్ మనస్తాపంతో రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం నడుస్తోంది. రాష్ట్రస్థాయి సమావేశాలకు సైతం ఆయన గైర్హాజరవుతుండడంతో అదే నిజం అని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది.. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో?

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు