Crime Mirror, Health Updates: డయాబెటిస్ క్యాపిటల్ గా భారత్ మారుతుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో సుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్యలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో డయాబెటిస్ సమస్య అధికంగా ఉంటుంది. తాజాగా వెళ్లడైన గణాంకాలు భారత్లో షుగర్ బాధితులు ఏ స్థాయిలో ఉన్నారన్న విషయాన్ని వెల్లడిస్తోంది.
తాజాగా జాతీయ కుటుంబ సర్వే – 6 ప్రకారం భారత్లో లక్షలాది మంది షుగర్ బాధితులు ఉన్నట్లు వెల్లడయింది. దీనికి ప్రధాన కారణం జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వృత్తిపరమైన ఒత్తిళ్లు వంటి అంశాలు కారణం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గడచిన మూడు ఏళ్లలో రెండు నుంచి నాలుగు శాతం మేర మహిళలు, పురుషుల్లో డయాబెటిస్ సమస్య పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది.
ఆందోళన కలిగిస్తున్న డయాబెటిస్ గణాంకాలు..
దేశంలో షుగర్ బాధితులు ఏ స్థాయిలో పెరిగితున్నారు అన్న విషయాన్ని తాజాగా ఆరోగ్య సర్వేకు సంబంధించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో 2019-21 మధ్యకాలంలో 13.5 శాతం మంది మహిళల్లో షుగర్ ఉంది. 2023-24 నాలుగు నాటికి మహిళల్లో డయాబెటిస్ సమస్య 17.8 శాతానికి పెరిగింది. అలాగే పురుషుల్లో ఈ సమస్య 15.6 శాతం నుంచి 20.9 శాతానికి పెరిగింది. 2023-24 ఏడాదికి సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను తాజాగా కేంద్రం వెల్లడించింది. ఇందులో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
అలాగే 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు గర్భ నిరోధక విధానాలు పాటించే వారి సంఖ్య 66.7 శాతం నుంచి 69.1 శాతానికి పెరిగింది. గర్భనిరోధానికి ఆధునిక పద్ధతులను వినియోగించేవారు సంఖ్య 56.4 శాతం నుంచి 52.7 శాతానికి తగ్గింది. సాంప్రదాయ విధానాలు పాటించే వారి సంఖ్య 10.3 శాతం నుంచి 16.4 శాతానికి పెరిగింది. అధిక స్థాయిలో మధుమేహం ఉన్నవారు లేదా మధుమేహ నియంత్రణకు మందులు వాడుతున్న మహిళలు 13.5 శాతం నుంచి 17.8 శాతానికి, పురుషులు 15.6 శాతం నుంచి 20.9 శాతానికి పెరిగారు.
దేశంలో గణనీయంగా తగ్గిన గృహహింస..
దేశంలో గృహింస కేసులు నమోదు సంఖ్య కూడా భారీగా తగ్గింది. 18 నుంచి 49 వేల మధ్య వివాహలో భాగస్వామి ద్వారా గృహహింసను ఎదుర్కొనే వారి సంఖ్య 29.2 శాతం నుంచి 22.3 శాతానికి తగ్గింది. గర్భం దాల్చిన తర్వాత భౌతిక అహించకు లోనవుతున్న వారి సంఖ్య 3.1 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గుముఖం పట్టింది. 18 నుంచి 29 ఏళ్లలోపు వయసున్న యువతుల్లో 18 ఏళ్ల నాటికి లైంగిక హింసకు గురయ్యే వారి సంఖ్య 1.2 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గింది. 15 ఏళ్ల పైబడిన మహిళల్లో పొగాకు ఉపయోగించేవారు 8.9 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గారు. 2019-21 కాలంతో పోలిస్తే 2023-24 నాటికి 18 ఏళ్లలోపే వివాహమైన యువతల సంఖ్య 23.3 శాతం నుంచి 20.1 శాతానికి తగ్గింది. 20వ కేల లోపు వివాహమైన యువకుల సంఖ్య 17.7 శాతం నుంచి 15.9 శాతానికి తగ్గుముఖం పట్టింది. అలాగే దేశంలో మద్యం తాగే మహిళల సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
గతంలో ఈ సంఖ్య 1.3 శాతం ఉండగా తాజాగా 1.1 శాతానికి తగ్గుముఖం పట్టింది. మద్యం తాగే మందు బాబుల సంఖ్య మాత్రం పెరిగింది. గతంలో 18.7 శాతం మంది పురుషులు మద్యం తాగితే తాజాగా ఈ సంఖ్య 18.9 శాతానికి పెరిగింది. ఇంటర్నెట్ వినియోగించే మహిళల సంఖ్య 33.3 శాతం నుంచి 64.3 శాతానికి పెరిగింది. ఇంటర్నెట్ వినియోగించే మహిళల సంఖ్య 33.3 శాతం నుంచి 64.3 శాతానికి భారీగా పెరిగింది. బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు ఉన్న మహిళల సంఖ్య 78.6 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. సొంత ఫోన్ ఉన్న మహిళల సంఖ్య 53.9 శాతం నుంచి 63.6 శాతానికి చేరింది.