HomeజాతీయంSabarimala Case: ఆలయంలోకి ఎవరు వెళ్లాలి? భక్తుడా.. నాస్తికుడా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Sabarimala Case: ఆలయంలోకి ఎవరు వెళ్లాలి? భక్తుడా.. నాస్తికుడా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Sabarimala Row: శబరిమల ఆలయ ప్రవేశ హక్కులపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, ఆలయంలోకి ప్రవేశం కోరుతున్న వ్యక్తి నిజంగా భక్తుడా? లేక నాస్తికుడా? అన్న విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించింది. మతపరమైన ప్రదేశాల్లో హక్కులను నిర్ణయించేటప్పుడు ఈ అంశం కూడా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై విచారణ

శబరిమలతో పాటు ఇతర మత స్థలాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న పరిమితులు వివక్షకరమా అనే అంశంపై దాఖలైన పిటిషన్లను 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తోంది. బుధవారం జరిగిన విచారణలో, 2018లో వచ్చిన తీర్పును సమర్థిస్తూ బిందు, కనకదుర్గ తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.

సంబంధం లేని వ్యక్తులు హక్కులు అడిగితే ఎలా?

ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగరత్న కీలక ప్రశ్నను లేవనెత్తారు. ఆలయంలో ప్రవేశం కోరుతున్నది నిజంగా ఆ ఆలయంపై విశ్వాసం కలిగిన భక్తురాలేనా? లేక ఎవరి ప్రేరణతోనో వచ్చిన నాస్తికురాలా? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆ ఆలయంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, దూర ప్రాంతాల నుండి వచ్చి ప్రవేశ హక్కును కోరితే, ఆ అంశాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు మత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు, సంప్రదాయాల మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే విషయంపై మరోసారి చర్చకు దారితీసాయి. శబరిమల కేసు దేశవ్యాప్తంగా మతాచారాలు, రాజ్యాంగ హక్కుల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని వెలుగులోకి తీసుకువస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు