Homeతెలంగాణనిప్పుల కొలిమిగా తెలంగాణ‌...వ‌డ‌దెబ్బ‌తో ఒక‌రు మృతి....!

నిప్పుల కొలిమిగా తెలంగాణ‌…వ‌డ‌దెబ్బ‌తో ఒక‌రు మృతి….!

  • రానున్న మూడు రోజుల్లో మ‌రింతే పెరిగే అవ‌కాశం

  • రాష్ట్రంలో 46 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

  • ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణలో భానుడు భగభగ మండుతున్నాడు. ఈ వేసవిలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును తాకడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. సోమవారం ఒక్కరోజే తీవ్రమైన ఎండల ధాటికి తట్టుకోలేక వడదెబ్బతో ముగ్గురు, పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీలు, పలు ఇతర జిల్లాల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

హైదరాబాద్‌లో సైతం కొన్ని ప్రాంతాల్లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ జిల్లాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లాలో భోగారపు మారయ్య (56), పెద్దపల్లి జిల్లాలో దశరథం సౌమ్య (19), నారాయణపేట జిల్లాలో గుర్తు తెలియని వృద్ధుడు వడదెబ్బకు గురై మరణించారు. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలో కుర్మరంగు జంగయ్య (51) అనే రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడి మృతిచెందాడు.

మధ్యాహ్నం వరకు ఉగ్రరూపం చూపిన సూరీడు సాయంత్రానికి చల్లబడ్డాడు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో చిరుజల్లులు కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అయితే, రానున్న మూడు రోజులు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరో 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు