క్రైమ్ మిర్రర్,న్యూఢిల్లీ:- సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత, అభ్యంతరకర పోస్టులు చేసిన వారిపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రధాని ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆయా ఖాతాలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.అబ్యూసివ్ కంటెంట్ పోస్ట్ చేసిన యూజర్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ‘ఎక్స్’ (ట్విట్టర్) తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రధాని వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేయడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా, శాంతిభద్రతల సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.సమాచారం అందించిన 3 గంటల్లోగా సంబంధిత యూజర్ల డేటాను భద్రపరిచి, ఆ అభ్యంతరకర పోస్టులను తక్షణమే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పోలీసులు ఆదేశించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
రేషన్ కార్డుల ఈ-కేవైసీకి రేపటితో ముగియనున్న గడువు: పొడిగింపుపై ఉత్కంఠ!
పశ్చిమ బెంగాల్లో మాజీ డ్రైవర్ ఇంట్లో భారీ నగదు, బంగారం పట్టివేత.. రూ.28 కోట్లు వెలుగులోకి!
