క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి అని తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ కీలక నివేదిక వెల్లడించింది. ఇవాళ, రేపు మరియు ఎల్లుండి పిడుగులతో కూడినటువంటి వర్షాలు జిల్లాలలో కురుస్తాయి అని తెలిపింది.
ఈరోజు వర్షాలు కురిసే జిల్లాలు :-
మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, శ్రీ సత్య సాయి, కడప మరియు అన్నమయ్య.
రేపు వర్షాలు కురిసే జిల్లాలు :- విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులపాటు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వ్యవసాయం చేసేటువంటి రైతన్నలు కూడా ఈ వర్షాలు పట్ల జాగ్రత్తలు వహించాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.
