ప్రముఖ ఓటీటీ వేదికగా గుర్తింపు పొందిన ఆహా ఇటీవల కాలంలో వినోద రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ దూసుకుపోతోంది. సూపర్ హిట్ సినిమాలు, వినూత్నమైన వెబ్ సిరీస్లు, ప్రేక్షకులను కట్టిపడేసే టాక్ షోలు వంటి విభిన్న కంటెంట్తో ఆహా తన అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కొనసాగుతున్న వేళ, అదే ఉత్సాహాన్ని ప్రతిబింబించే విధంగా ఆహా వేదికపై ప్రసారమవుతున్న ప్రముఖ గేమ్ షో ‘సర్కార్’ కొత్త ఎపిసోడ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ తాజా ఎపిసోడ్ పూర్తిగా క్రికెట్ నేపథ్యంతో రూపొందించబడగా, మాజీ భారత క్రికెటర్ ఎంఎస్ కే ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు కల్యాణ్ కృష్ణ, కౌషిక్ ఎన్ సీ, విద్య ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని సందడిని రెట్టింపు చేశారు.
View this post on Instagram
ఈ ఎపిసోడ్లో ఎంఎస్ కే ప్రసాద్ తన క్రికెట్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా పంచుకుంటూ ప్రేక్షకులను అలరించారు. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్గా పనిచేసిన ఆయన, తన పదవీకాలంలో జరిగిన ఎన్నో కీలక పరిణామాలను, జట్టు ఎంపికలో తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కథలను సరదాగా వివరించారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మ్యాచ్ల సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలను వెల్లడించారు. అలాగే ఐపీఎల్లో ఆయన చేసిన వ్యాఖ్యాన శైలి గురించి మాట్లాడుతూ.. ఆ అనుభవాలు తనకు ఎలా ప్రత్యేకంగా నిలిచాయో వివరించారు.
ఇక ఈ కార్యక్రమంలో సరదా ఆటలు, చురుకైన ప్రశ్నలు, నవ్వులు పంచే సంభాషణలతో ఎపిసోడ్ మొత్తం ఉత్సాహభరితంగా సాగింది. క్రికెట్ ముచ్చట్లు, వినోదాత్మక గేమ్స్, అతిథుల మధ్య జరిగే సరదా సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ఐపీఎల్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ఎపిసోడ్ ద్వారా ఆహా, క్రికెట్ అభిమానులను మరింతగా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రత్యేక ఎపిసోడ్ ఆహా వేదికపై ప్రసారమవుతూ మంచి ఆదరణను సొంతం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఎపిసోడ్పై పాజిటివ్ స్పందన వెల్లువెత్తుతోంది.
