Homeతెలంగాణపంట‌ నమోదుకు రైతులు సహకరించాలి

పంట‌ నమోదుకు రైతులు సహకరించాలి

ఏఈఓ విన‌య్ కుమార్‌

పెద్దపల్లి, క్రైం మిర్ర‌ర్ః
రైతులంద‌రూ యాసంగి పంట‌ల న‌మోదుకు రైతులు స‌కాలంలో వ‌చ్చి స‌హ‌క‌రించాల‌ని ఏఈవో విన‌య్ కుమార్ కోరారు.

రైతులు సాగు చేసిన పంట‌ల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తూ న‌మోదు చేసుకుంటున్నామ‌ని తెలిపారు.

ఇందులో భాగంగా గత మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో నమోదు కార్యక్రమం పూర్తి చేసుకొని శుక్రవారం పట్టణoలోని చందపల్లి పాత గ్రామ పంచాయతీ బస్తీ దవాఖాన వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు.

న‌మోదు వ‌ల్ల క‌లిగే లాభాలు రైతుల‌కువివ‌రించారు.. అలాగే మక్క పంట వేసిన రైతులు, పంట ను మార్చిన రైతులు ఇంకా ఎవరైనా నమోదు ఉంటే వచ్చి చేసుకోవాలని ఆయన సూచించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు